News November 9, 2024
నెల్లూరు జిల్లాలో ఉచితంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు

నెల్లూరు జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు APSPDCL జిల్లా సర్కిల్ SE విజయ్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లకు వినియోగదారులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదన్నారు. ఇప్పటికే 8 వేల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. కచ్చితమైన విద్యుత్ రీడింగ్ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News July 11, 2025
మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News July 11, 2025
కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో బెయిల్

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో ఊరట లభించింది. కృష్ణపట్నం పోర్టు రోడ్ పంట పాలెం వద్ద అక్రమ టోల్ గేట్ పెట్టి వాహనాలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో రైల్వే కోర్ట్ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ బెయిల్ మంజూరు చేశారు.
News July 10, 2025
కావలి: గోడ కూలి బేల్దారి మృతి

కావలిలో గోడ కూలి బేల్దారి మృతి చెందాడు. డ్రైనేజీ కాలువ నిర్మించేందుకు తవ్వుతుండగా పక్కనేఉన్న గోడ కూలి మృతి చెందాడు. మృతుడు బోగోలు మండలం సాంబశివపురం తాతా వెంకయ్యగా గ్రామస్థులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బేల్దారి మేస్త్రిలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.