News March 25, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ధరలు..?

నెల్లూరులో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నిరుడు పుట్టి(20 బస్తాలు) రూ.23వేల ధర పలగ్గా.. ఇప్పుడు ఆ ధర రూ.18,500కు తగ్గినట్లు రైతులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఈ ధర రూ.16వేల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతులకు రూ.19వేల మద్దతు ధర చెల్లిస్తుంది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో గ్రామం, మండలంతో కామెంట్ చేయండి.
Similar News
News November 18, 2025
నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.14.90 లక్షలు స్వాహా

నెల్లూరులోని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.14.90 లక్షలు తీసుకున్నారని SP డా.అజిత వేజెండ్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. బీవీ నగర్కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పించకుండా.. నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
News November 18, 2025
నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.14.90 లక్షలు స్వాహా

నెల్లూరులోని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.14.90 లక్షలు తీసుకున్నారని SP డా.అజిత వేజెండ్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. బీవీ నగర్కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పించకుండా.. నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
News November 18, 2025
ముత్తుకూరు హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం రొయ్యలపాలెంలో జరిగిన హత్య కేసులో ముద్దాయి పాముల శీనయ్యకు జీవిత ఖైదుతోపాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు 3rd ADJ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2022 సం. ఏప్రిల్ 24న ముద్దాయి తన అన్నతో ఆస్తి విషయంలో గోడవ పడి అతని తలమీద కొట్టి ఇంటిని కాల్చి అతి కిరాతకంగా హత్య చేశాడు. తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచడంతో నేరం రుజువై శిక్ష ఖరారు చేశారు.


