News September 23, 2024
నెల్లూరు జిల్లాలో భారీగా అధికారుల బదిలీలు

జిల్లాలో ఆదివారం పలువురు అధికారులు బదిలీ అయ్యారు. వారిలో ఆరుగురు MROలు, 55-డిప్యూటీ MROలు, 17-రీసర్వే డిప్యూటీ తహశీల్దార్లు, 70-సీనియర్ అసిస్టెంట్లు, 27 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వారితోపాటూ ప్రధానంగా జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో చిరంజీవులు, డీపీవో సుస్మితారెడ్డి, డీఆర్డీఏ పీడీ కేవీ సాంబశివారెడ్డి, డ్వామా పీడీ వెంకట్రావు, డీఎఫ్ఓ ఆవుల చంద్రశేఖర్ బదిలీ అయ్యారు.
Similar News
News July 7, 2025
నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
News July 6, 2025
మంత్రి లోకేశ్కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.
News July 6, 2025
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కలెక్టర్

నెల్లూరు బారాషహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పండుగ ఏర్పాట్లు, భద్రత, వసతులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.