News April 3, 2025
నెల్లూరు జిల్లాలో విషాదం

బడికి వెళ్లి చదువుకోవాల్సిన ఆ చిన్నారికి ఏ కష్టం వచ్చిందో ఏమో. 6వ తరగతికే ఈ జీవితం చాలు అనుకుంది. 11 ఏళ్ల ప్రాయంలోనే బలవనర్మణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. ఆత్మకూరు పట్టణంలోని వందూరుగుంటకు చెందిన బాలిక(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఈక్రమంలో ఇవాళ ఇంట్లోని బాత్ రూములో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News April 25, 2025
NLR: నేటి నుంచి నోషనల్ ఖాతాల స్పెషల్ డ్రైవ్

నెల్లూరు జిల్లాలో 95వేలకు పైగా ఉన్న నోషనల్ ఖాతాల పరిష్కారానికి ఈనెల 25 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. 1,84,288 సర్వే నంబర్లలోని 95,065 నోషనల్ ఖాతాలకు సంబంధించి రోజూ జిల్లాలోని నాలుగు డివిజన్ల నుంచి రెండేసి మండలాల చొప్పున పరిశీలిస్తారు. రోజూ 8 మండలాల నోషనల్ ఖాతాలను పరిశీలించి రైతుల సమస్యలు పరిష్కరిస్తారు.
News April 24, 2025
NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

రేషన్ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్ ఇంటర్నెట్లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.
News April 24, 2025
16 పాఠశాలల్లో అందరూ పాస్: అరుణమ్మ

నెల్లూరులోని 16 జడ్పీ పాఠశాలల్లో అందరూ పాసయ్యారని జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 10,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 7,414 మంది పాసయ్యారని చెప్పారు. 595 మార్కులతో పూజిత అనే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు.