News September 21, 2024

నెల్లూరు జిల్లాలో HC లకు ASI లుగా ఉద్యోగోన్నతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 24 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఎస్పీ జీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఆయా స్టేషన్లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్‌తో పాటు తిరుపతి జిల్లాకు చెందిన పి.కృష్ణ, పి.చంద్రయ్య, షేక్ ఖాదర్ మస్తాన్, షేక్ అహ్మద్ బాషా, సి.వెంకటేశ్వరరావు జాబితాలో ఉన్నారు.

Similar News

News December 7, 2025

నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనును సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.

News December 7, 2025

సైదాపురం : వంతెనకు మరమ్మతులు చేయరూ?

image

సైదాపురం నుంచి గూడూరుకి వెళ్లే ప్రధాన రహదారిలో కైవల్య నదిపై వంతెన ఉంది. ఇది రాజంపేట నుంచి గూడూరుకి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.12 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనపై గుంత ఏర్పడి కమ్మీలు బయటపడటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

News December 7, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు

image

మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కాకాణిపై ఉన్నాయి.