News January 5, 2025

నెల్లూరు జిల్లా వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన్నెమాల

image

వైసీపీ నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిడూరుకు చెందిన మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అభివృద్ధికి మన్నెమాల ఎంతో కృషి చేసి చేశారని, గ్రామంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నాడని సన్నిహితులు తెలిపారు. దీంతో అధిష్ఠానం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పదవినిచ్చినట్లుగా నాయకులు తెలిపారు.

Similar News

News January 14, 2025

నెల్లూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాచలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇందుకూరుపేట(M), లేబూరుకు చెందిన కాలేషా(45), అతని కొడుకు హమీద్(12) మృతి చెందారు. మనుబోలులో జరిగిన రోడ్డుప్రమాదంలో సైదాపురం(M), గంగదేవిపల్లికి చెందిన సుబ్బయ్య(34), శంకరయ్య(39)దుర్మరణం చెందారు. గుడ్లూరులో జరిగి రోడ్డుప్రమాదంలో రాపూరుకు చెందిన వెంకటేశ్వర్లు(60), హార్దిక రాజ్(4) మరణించారు.

News January 14, 2025

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

News January 14, 2025

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.