News May 24, 2024
నెల్లూరు జైలుకు పల్నాడు పెట్రోల్ బాంబుల నిందితులు

పోలింగ్ రోజు దాచేపల్లి మండలం తంగెడలో జరిగిన పెట్రోల్ బాంబుల దాడి ఘటనలో నిందితులను నెల్లూరు, గుంటూరు జిల్లా జైలుకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీకి చెందిన 22 మందిని, TDPకి చెందిన 11 మందిని అరెస్టు చేసి కోర్టుకు పంపగా 14 రోజులు రిమాండ్ విధించారు. రెండు వర్గాలలో ఒక వర్గం వారిని నెల్లూరు జిల్లా జైలుకు, మరో వర్గం వారిని గుంటూరు జిల్లా జైలుకు పంపారు.
Similar News
News March 17, 2026
GNT: రూ.10 కోట్లతో ఫైనాన్స్ యజమాని పరార్

లక్ష పెడితే నెలకు రూ. 10 వేల లాభమంటూ నమ్మించిన ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని వందల మందికి టోకరా వేశాడు. గుంటూరు అరండల్పేటలో ‘ట్రేడ్ దోస్త్’ పేరుతో సంస్థ నడిపిన బాపట్లకు చెందిన వెంకట పూర్ణచంద్రరావు.. ఏజెంట్ల ద్వారా సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
News March 17, 2026
గుంటూరు: పోలీస్ సిబ్బంది సమస్యలపై ఎస్పీ ఆరా

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్’ కార్యక్రమం నిర్వహించారు. SP వకుల్ జిందాల్ స్వయంగా సిబ్బంది నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధి నిర్వహణలో అనుకూల వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎస్పీ అన్నారు.
News March 17, 2026
గుంటూరు: పోలీస్ సిబ్బంది సమస్యలపై ఎస్పీ ఆరా

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్’ కార్యక్రమం నిర్వహించారు. SP వకుల్ జిందాల్ స్వయంగా సిబ్బంది నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధి నిర్వహణలో అనుకూల వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎస్పీ అన్నారు.


