News June 26, 2024
నెల్లూరు: టీడీపీ కీలక నేత కిలారి వెంకటస్వామి నాయుడు మృతి

నెల్లూరు జిల్లా టీడీపీ ముఖ్య నేత, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు కాసేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సుదీర్ఘకాలం టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. నిన్న సాయంత్రం వరకు ఎంతో చలాకీగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన… రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. బీవీ నగర్ సాయిబాబా మందిరం ఛైర్మన్గా కూడా కిలారి వెంకటస్వామి నాయుడు వ్యవహరిస్తున్నారు.
Similar News
News November 6, 2025
మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.
News November 6, 2025
నెల్లూరు యువకుడిని మోసం చేసిన యువతులు

నెల్లూరు సిటీకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో హార్డ్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పూర్వ, లావణ్య పరిచయమయ్యారు. పూర్వ ఆన్లైన్ ట్రేడింగ్లో రూ.2లక్షలు పెట్టించింది. లావణ్య సైతం ట్రేడింగ్లో పలుదఫాలుగా రూ.10లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి రూ.54వేలు కట్టాలని లావణ్య కోరింది. మోసపోయానని గ్రహించిన యువకుడు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News November 6, 2025
నెల్లూరు జిల్లా విభజన ఇలా..!

మరోసారి నెల్లూరు జిల్లా విభజన జరగనుంది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు నెల్లూరులోకి రానుంది. విడవలూరు, కొడవలూరును కావలి నుంచి నెల్లూరు డివిజన్లోకి మార్చనున్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం గూడూరు డివిజన్లోకి, వరికుంటపాడు, కొండాపురం జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, ఉదయగిరిని కావలి డివిజన్లోకి మార్చేలా ప్రతిపాదనలు చేశారు.


