News June 26, 2024

నెల్లూరు: టీడీపీ కీలక నేత కిలారి వెంకటస్వామి నాయుడు మృతి

image

నెల్లూరు జిల్లా టీడీపీ ముఖ్య నేత, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు కాసేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సుదీర్ఘకాలం టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. నిన్న సాయంత్రం వరకు ఎంతో చలాకీగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన… రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. బీవీ నగర్ సాయిబాబా మందిరం ఛైర్మన్‌గా కూడా కిలారి వెంకటస్వామి నాయుడు వ్యవహరిస్తున్నారు.

Similar News

News October 20, 2025

కందుకూరు TDPలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

image

కందుకూరు నియోజకవర్గ టీడీపీలో ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ..’ అన్న సామెత ఆదివారం నిజమైంది. రెండు దశాబ్దాల పాటు TDPలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ MLA డా.దివి శివరాంకు ఆదివారం దారకానిపాడులో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. శివరాం అనుచరుడిగా, ఆయన పైరవీలతో పార్టీ ఇన్‌ఛార్జ్ అయి, ప్రస్తుతం MLAగా ఉన్న ఇంటూరి నాగేశ్వరావు కుర్చీలో కూర్చుంటే వెనుక వరుసలో శివరాం నిలబడాల్సి వచ్చింది.

News October 20, 2025

కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

image

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 20, 2025

కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

image

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.