News March 27, 2025

నెల్లూరు: టీబీ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

image

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో C.y.T.B లేటెంట్ క్షయ వ్యాధి నిర్ధారిత పరీక్షలు జరుగుతున్నాయి. సంబంధిత కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుజాత, డాక్టర్ ఖాదర్ వలీ బుధవారం ప్రారంభించారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ.. ఈ పరీక్ష ద్వారా క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని సూచించారు. టీబీ నివారణ వ్యాక్సిన్లు జిల్లాలోని అన్ని సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News April 18, 2025

నెల్లూరు ప్రజలకు పోలీసుల కీలక సూచన

image

నెల్లూరు జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచన చేశారు. వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కావలి పట్టణంలో ఇదే తరహాలో ఊరు చివర కారు పెట్టుకుని ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. వైట్ షిఫ్ట్ కారు ఊరి శివారు ఏరియాలో ఉంటే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News April 18, 2025

నెల్లూరు: 26 మందికి రూ.74.57లక్షల పంపిణీ 

image

నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారి ఆర్థిక సహాయంతో నెల్లూరు జిల్లాకు చెందిన 26 మంది దివ్యాంగులకు రూ.74,57,500 చెక్కులను జాయింట్ కలెక్టర్ కార్తీక్ పంపిణీ చేశారు. స్వయం ఉపాధి పనులు చేసుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులు సమాజంలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ ఏ.మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు.

News April 17, 2025

నెల్లూరు: 3.69 లక్షల ఎకరాలకు సాగునీరు

image

నెల్లూరు జిల్లాలో 3.69 లక్షల ఎకరాల రెండో పంటకు నీరు అందించాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నెల్లూరులోని జడ్పీ హాలులో ఐఏబీ సమావేశం జరిగింది. 41 టీఎంసీల జలాలను రెండో పంటకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఈ విషయంలో సాగునీటి సంఘాల ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.

error: Content is protected !!