News February 1, 2025
నెల్లూరు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మైనార్టీ మహిళ

నెల్లూరు డిప్యూటీ మేయర్ TDP అభ్యర్థిగా 48వ డివిజన్ కార్పొరేటర్, ముస్లిం మైనార్టీకి చెందిన మహిళ తెహసీన్ను ఆ పార్టీ ఎంపిక చేసింది. నగరపాలక సంస్థ చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. సోమవారం జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో TDP ఆమె పేరును తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెహసీన్కు అభినందనలు తెలిపారు.
Similar News
News April 24, 2025
మరికాసేపట్లో మధుసూదన్ ఇంటికి మంత్రి ఆనం

ఉగ్రవాదుల దాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించనున్నారు.
News April 24, 2025
నెల్లూరులో డిగ్రీ యువకుడి సూసైడ్

ఫెయిల్ కావడంతో ఓ యువకుడ సూసైడ్ చేసుకున్న ఘటన నెల్లూరులో జరిగింది. సిటీలోని హరనాథపురానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(22) డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మార్చి 31న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చెన్నైకి తీసుకెళ్లారు. తర్వాత నెల్లూరుకు తీసుకు వచ్చి ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అతను చనిపోయాడు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 24, 2025
ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరులో ర్యాలీ

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు చేపట్టారు. వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు వేర్వేరుగా క్యాండిల్ ర్యాలీ చేపట్టి మృతులకు నివాళులు అర్పించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని కోరారు.