News August 8, 2024
నెల్లూరు: డీఎస్సీ గిరిజన అభ్యర్థులకు శుభవార్త

జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులకు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పరిమళ తెలిపారు. శిక్షణ సమయంలో భోజన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో వివరాలు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు ఆఫీసు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Similar News
News December 11, 2025
నెల్లూరు కలెక్టర్కు 2వ ర్యాంకు

నెల్లూరు కలెక్టర్గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్లో మన కలెక్టర్కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.
News December 11, 2025
నెల్లూరు: నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్ఫోర్స్

నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు. ప్రతి బృందానికి SI స్థాయి అధికారి ఇన్ఛార్జ్గా ఉంటారని చెప్పారు. జిల్లాలో 6 స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వ్యవస్థను మరింత చురుగ్గా, సమయస్ఫూర్తితో సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
News December 11, 2025
15న నెల్లూరులో భారీ ర్యాలీ: కాకాణి

నెల్లూరులో ఈనెల 15వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. సర్వేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 17మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తున్నందుకు నిరసనగా తమ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసిందన్నారు. అన్ని చోట్లా సేకరించిన సంతకాలను 15న జిల్లా కార్యాలయానికి చేరుస్తామన్నారు.


