News October 29, 2024
నెల్లూరు: దేవాలయాలకు నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ

రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ డైరీల సంఘాలు, సంస్థ ప్రతినిధులతో చర్చించారు.
Similar News
News October 18, 2025
అధిష్ఠానం ముందుకు.. నెల్లూరు టీడీపీ నేతల వ్యవహారం!

నెల్లూరులో పెద్ద దుమారం రేపిన రేషన్ మాఫియా వ్యవహారం TDP అధిష్ఠానం వద్దకు చేరుకుంది. నెల్లూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఇటీవల పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ద్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రేషన్ మాఫియా వెనుక ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నుడా చైర్మన్, మరో నేత విజయవాడకు వెళ్లినట్టు సమాచారం.
News October 18, 2025
నెల్లూరు: సా.. గుతున్న పెన్నా రివిట్మెంట్ వాల్ పనులు !

వరద ప్రవాహాల నుంచి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా నగరంలోని పెన్నా నది భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో చేపడుతున్న రివిట్మెంట్ వాల్ కాలాతీతం అవుతుంది. ఇటీవల సోమశిల రిజర్వాయర్ నుంచి వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. కాగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పెన్నాకు వరద నీరు భారీగా చేరుతుంది. ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత ముప్పు తప్పుతుందని స్థానికులు పేర్కొన్నారు.
News October 18, 2025
రూ.1కే సిమ్.. రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా

BSNL కొత్త వినియోగదారులకు దీపావళి సందర్భంగా కానుక ప్రకటించినట్లు నెల్లూరు జిల్లా జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్ అందిస్తూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం కానీ ఏజెంట్ల ద్వారా ఈ అవకాశం నవంబర్ 15 వరకు పొందవచ్చు అన్నారు.