News January 18, 2025
నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ

ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర సాకారం అవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు నగరంలో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు, గాంధీ బొమ్మకు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో 722 గ్రామ పంచాయతీలతో పాటు, మున్సిపాలిటీలలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.
News December 2, 2025
నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.
News December 2, 2025
నెల్లూరు: అసాంఘిక శక్తుల నివారణకు SP కార్యాచరణ

నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది. ఈ దూరాన్ని తగ్గించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకొస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే.. 112 కి, ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు గంజాయి, సైబర్ నేరాలు, ఇసుక అక్రమ రవాణా వంటి ఇతరత్రా నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.


