News April 25, 2024

నెల్లూరు నగరంలో యువకుడి దారుణహత్య 

image

నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన రామయ్య కుమారుడు దశరథ తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన దశరథ తిరిగి రాలేదు. మంగళవారం ఆటోనగర్‌లో దశరథ మృతదేహం వెలుగుజూసింది. కత్తులతో తీవ్రంగా దాడిచేయడంతో దశరథ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 14, 2025

శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ

image

శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.

News January 14, 2025

నెల్లూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాచలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇందుకూరుపేట(M), లేబూరుకు చెందిన కాలేషా(45), అతని కొడుకు హమీద్(12) మృతి చెందారు. మనుబోలులో జరిగిన రోడ్డుప్రమాదంలో సైదాపురం(M), గంగదేవిపల్లికి చెందిన సుబ్బయ్య(34), శంకరయ్య(39)దుర్మరణం చెందారు. గుడ్లూరులో జరిగి రోడ్డుప్రమాదంలో రాపూరుకు చెందిన వెంకటేశ్వర్లు(60), హార్దిక రాజ్(4) మరణించారు.

News January 14, 2025

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.