News March 30, 2024

నెల్లూరు: నాయుడుపేటలో సిద్ధం బహిరంగ సభ

image

నాయుడుపేట పట్టణంలో ఏప్రిల్ 4వ తేదీన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి సభ ఏర్పాట్లను పరిశీలించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

Similar News

News November 15, 2025

ప్రతి 20KM కు EVఛార్జింగ్ స్టేషన్ కోసం కసరత్తు

image

జిల్లాలో EV వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు కసరత్తు మొదలైంది. జాతీయ రహదారులపై ప్రతి 20KM కు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. PMఈ-డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేసే ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లకు 80% రాయితీ లభిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 25 స్థలాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

News November 15, 2025

చేజర్ల మండలంలో రోడ్డు ప్రమాదం

image

చేజర్ల మండలం ఏటూరు కండ్రిక వద్ద శుక్రవారం గేదెను బైకు ఢీకొట్టింది. నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ముప్పసాని బాబు పోస్టల్ శాఖలో పనిచేస్తున్నారు. పొదలకూరు నుంచి పని ముగించుకుని తన గ్రామానికి తిరిగి వస్తుండగా గేదెను ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు 108 సాయంతో పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 15, 2025

Way2News కథనం.. మంత్రి ఆదేశాలతో పనులు

image

నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్‌పైన జాయింట్ల వద్ద రూ.40లక్షలతో మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ నందన్ తెలిపారు. ఈ పనులు 16వ తేదీ నుంచి సుమారుగా 45 రోజులపాటు జరుగుతాయన్నారు. మంత్రి నారాయణ ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమస్యపై ఇటీవల “మంత్రి వర్యా.. ఇదీ మీ సమస్య కాదా” అన్న శీర్షికన Way2News కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి మరమ్మతులకు ఆదేశించారు.