News July 23, 2024

నెల్లూరు: నేటి నుంచి ఇంజినీరింగ్ తుది కౌన్సెలింగ్

image

ఏపీఈఏపీ సెట్ 2024 లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంజినీరింగ్ తుది జాబితా కౌన్సెలింగ్ ఇవాళ నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందని ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అడ్మిన్ శివకుమార్ తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందని విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజును నెల 25వ తేదీలోపు చెల్లించాలని తెలిపారు.

Similar News

News October 23, 2025

VIDEO.. సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

సోమశిల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వర్షపు నీరు డ్యామ్ నిర్ధిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీంతో దిగువ పెన్నా డెల్టాకు 32,650 నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 70 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉందని అధికారులు వెల్లడించారు.

News October 23, 2025

ఊపిరి పీల్చుకున్న నెల్లూరు.. వర్షం ముప్పు తప్పునట్టేనా!

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా నెల్లూరులో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి చిన్నచిన్న చినుకులు మినహా వర్షం పడలేదు. ఉదయం నుంచి ఎండ కాస్తోంది. దీంతో తుఫాను ముప్పు తప్పినట్టేనని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News October 23, 2025

ఛామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు..!

image

జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల గ్రామం నుంచి కావలికి వెళ్లేందుకు తన బైక్‌పై నేరెళ్ల వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ తోపాటు మల్లికార్జున కూడ సప్తా పై నుంచి వాగులో పడిపోయారు. విషయం తెలుసుకున్న జలదంకి తహశీల్దార్ ప్రమీల, ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి గాలింపు చర్యలు చేపట్టారు.