News October 9, 2024

నెల్లూరు: నేటి నుంచి K.G రూ.50కే టమోటాలు

image

నెల్లూరు జిల్లా రైతుబజార్‌ల‌లో నేటి నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై టమోటాల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితాకుమారి పేర్కొన్నారు. ప్రధానంగా నెల్లూరులోని పత్తేఖాన్ పేట, నవాబుపేట రైతుబజార్లో పాటు, కావలి, కందుకూరు, పొదలకూరు రైతుబజారులలో టమోటాలు విక్రయిస్తారన్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకుని రావాలని, ఒకరికి రెండు కిలోలు మాత్రమే ఇస్తామన్నారు.

Similar News

News October 9, 2024

నెల్లూరు జిల్లాలో త్వరలో ఎన్నికలు: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో త్వరలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒ.ఆనంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరు శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి ఓటరు జాబితా తయారు చేయాలని కోరారు. రెవెన్యూలో ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్ల మంజూరు, మ్యూటేషన్‌ ట్రాన్సాక్షన్లపై తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

News October 8, 2024

నెల్లూరు: భక్తిశ్రద్ధలతో కౌమారి పూజ

image

నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కౌమారి పూజను మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి స్వరూపంగా ఓ చిన్నారికి బాలత్రిపుర సుందరి అలంకారం చేసి పూజలు జరిపారు. అనంతరం ఆ చిన్నారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పోటీపడ్డారు. మరోవైపు బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సరస్వతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

News October 8, 2024

దోచుకోవడంలో సోమిరెడ్డి దిట్ట: వైసీపీ

image

దోచుకోవడంలో సర్వేపల్లి MLA సోమిరెడ్డి దిట్ట అని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆడపాల ఏడుకొండలు ఆరోపించారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లిలో సోమిరెడ్డి దోపిడీపై ప్రశ్నించిన వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగతన్నారు. సోమిరెడ్డికి దమ్ముంటే తన అవినీతిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎస్పీ నాయకులు నరసయ్య, కృష్ణ, రఘు, శివ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.