News February 3, 2025

నెల్లూరు: నేడే ఎన్నిక.. క్షణం క్షణం ఉత్కంఠ 

image

నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ పదవి కోసం టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతున్నారు. గెలుపు కోసం అటు మంత్రి పొంగూరు నారాయణ, ఇటు కాకాణి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాగా ఇటీవల వైసీపీ నుంచి 41 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి మారినట్లు సమాచారం. కాగా నెల్లూరులో మొత్తం 54 కార్పొరేటర్లు ఉండగా ఒకరు రాజీనామా చేయడంతో 53 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Similar News

News January 23, 2026

నెల్లూరు GGHలో శవాలను తినే రాబందులు!

image

నెల్లూరు GGHలో కొందరు డాక్టర్లు శవాలపై సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెడ్‌బాడీలకు పోస్ట్‌మార్టం చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఓ SIని సైతం లంచం డిమాండ్ చేయడం విస్తుపోయేలా చేస్తోంది. కొత్తవంగల్లులో 3ఏళ్ల క్రితం సుశీలమ్మ మరణించింది. ఇటీవల హత్య అని తేలడంతో SI రీపోస్టుమార్టం కోసం GGHకు వెళ్లగా రూ.30 వేలు డిమాండ్ చేశారట. ఆయన దీనిపై ఫిర్యాదు చేసినట్లు అధికారులకు తెలుస్తోంది.

News January 23, 2026

నెల్లూరు: జవాన్‌పై దాడి.. ఇరు వర్గాలపై కేసు

image

BSF జవాన్ జోడు వెంకటప్రసాద్‌పై దాడి కేసులో పరస్పర ఫిర్యాదులు అందడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీతారాంపురం ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఒడిశాలో పనిచేస్తున్న ఆయన కుటుంబంతో కలిసి సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో పాతకక్షలను దృష్టిలో ఉంచుకున్న స్థానికులు బంధుగుల ప్రసాద్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు గ్రామ రోడ్డు సెంటర్లో ఉన్న జవాన్‌పై మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు.

News January 23, 2026

నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

image

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.