News July 31, 2024
నెల్లూరు: పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీలకు ఎన్నికలు

ప్రభుత్వ పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీలకు ఎన్నికలు ఆగష్టు8 న జరిగేలా ప్రభుత్వం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఉన్న తల్లిదండ్రుల కమిటీ పేరును కూటమి ప్రభుత్వం మేనేజ్మెంట్ కమిటీలుగా మార్పు చేసింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ఎన్నికలకు2న నోటిఫికేషన్ ప్రకటన, 5న ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరణ, తుది జాబితా ప్రకటన, 8న ఎన్నికల నిర్వహణ ఉంటుంది. పాత కమిటీల పదవీకాలం ఈ నెలతో ముగిసింది.
Similar News
News January 9, 2026
నెల్లూరు: ఒక్కో తాటాకు రూ.10

భోగి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మంటలు వేస్తుంటారు. పల్లెటూర్లో అయితే అడవికి వెళ్లి ఏదో ఒక ఆకు కొట్టుకు వచ్చి మంటలు వేస్తున్నారు. పట్టణాల్లో అలా వేయడం కుదరదు. దీన్నే కొందరు పల్లెటూరు వాసులు క్యాష్ చేసుకుంటున్నారు. తాటాకులను నెల్లూరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కో తాటి మట్ట రూ.10లకు, కట్ట రూ.80లకు అమ్ముతున్నారు. ఆకులు కొట్టే కూలీలు, వాటిని అమ్మే వారికి డబ్బులు సమకూరుతున్నాయి.
News January 9, 2026
నెల్లూరు జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలును హోం మంత్రి అనిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లోని వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ నేతలు ఆయనతో ములాఖాత్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఆకస్మిక తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకుంది.
News January 9, 2026
త్వరలో సూళ్లూరుపేటకు మహర్దశ.!

సూళ్లూరుపేట(M) బీవీపాలెం సమీపంలో దాదాపు 150 ఎకరాల్లో ఫ్లోటింగ్ వాటర్ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఎకో-టూరిజంతో పాటు పులికాట్ పరిసర ప్రాంతాల్లో గ్రీన్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు. ఈ టూరిజాన్ని PPP మోడల్లో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక టూరిజం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 పైచిలుకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.


