News April 30, 2024

నెల్లూరు పార్లమెంట్ బరిలో 14 మంది

image

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ అనంతరం అధికారిక జాబితా విడుదల చేశారు. మొత్తం 15 నామినేషన్‌లో ఉండగా వారిలో ఒకరు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 14 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది.

Similar News

News November 18, 2025

దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

image

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.

News November 18, 2025

దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

image

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.

News November 18, 2025

నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

image

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.