News July 19, 2024
నెల్లూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.17లక్షలు దోచేశాడు

నెల్లూరు బాలాజీనగర్లోని శ్రీహరినగర్ చెందిన ఓ మహిళకు సునీల్ బాబుతో వివాహమైంది. కుటుంబ కలహాలతో మూడేళ్లకే భర్త నుంచి విడిపోయి ఆమె తన కుమారుడితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. 2014లో ఆమెకు వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన మనోజ్కుమార్తో పరిచయమైంది. తనకు వివాహం కాలేదని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.17 లక్షల దోచేసి మోసం చేశాడని భాధితురాలు ఫిర్యాదుతో గురువారం కేసు నమోదైంది.
Similar News
News November 26, 2025
నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
News November 26, 2025
నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
News November 26, 2025
నెల్లూరు: 3 మండలాలు, ఒక నియోజకవర్గం ఔట్

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.


