News February 3, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్కు 95 ఫిర్యాదులు

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News February 19, 2025
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 9వ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. తాను 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. జిల్లా ఓకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 3 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ 5 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ 8 కేంద్రాలను చెక్ చేసిందన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు. 51 మంది ప్రాక్టికల్స్కు రాలేదన్నారు.
News February 19, 2025
నెల్లూరు: నష్టపరిహారం ఇవ్వాలని వినతి

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేత మిడతల రమేశ్ కోరారు. ఈ మేరకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ డీఏవో అనిల్కు వినతిపత్రం అందజేశారు. దుగ్గుంట, వావింటపర్తి, అంకుపల్లి పంచాయతీలో రైల్వే లైన్ రాళ్లు నాటి నాలుగేళ్లు దాటిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
News February 18, 2025
నెల్లూరు కలెక్టర్ను ప్రశ్నిస్తూ కాకాణి లేఖ

నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయ ధోరణితో రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ.. నిబంధనలకు విరుద్ధంగా 5 మంది సభ్యుల సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయడంపై లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడున్న కమిటీని రద్దుచేసి నిబంధన ప్రకారం కమిటీని ఎన్నుకోవాలన్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.