News January 7, 2025

నెల్లూరు ప్రజలు భయపడకండి: DMHO

image

బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న నెల్లూరు వాసులు సంక్రాంతికి తమ స్వగ్రామాలకు రానున్నారు. అక్కడ HMPV కేసు నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ కేసులు లేవని.. కరోనా లాగా ప్రభావం కూడా ఉండదని నెల్లూరు DMHO వి.సుజాత చెప్పారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస సమస్యలుంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్లను సంప్రదించాలని కోరారు. వారం రోజుల్లో సమస్య తగ్గిపోతుందన్నారు.

Similar News

News November 18, 2025

దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

image

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.

News November 18, 2025

దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

image

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.

News November 18, 2025

నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

image

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.