News September 16, 2024
నెల్లూరు :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
Similar News
News December 27, 2025
నెల్లూరులో ఫేక్ ITCలతో రూ. 43 కోట్ల టోకరా !

నెల్లూరులో పెద్ద పెద్ద కంపెనీలు పన్నుల ఎగవేతకు కొత్త పంథాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ జేసీ కిరణకుమార్ Way2Newsతో మాట్లాడుతూ.. నెల్లూరు డివిజన్ పరిధిలో రూ. 43 కోట్ల మేరా ఫేక్ ITC లను తీసుకున్నారని తెలిపారు. 8 సంస్థలపై కేసులు నమోదు చేశామని, ఇందులో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా.. ముగ్గురు 10% డిమాండ్ కట్టి అప్పీల్ కి వెళ్లారని వివరించారు.
News December 27, 2025
నెల్లూరు: ‘తెలుగు తమ్ముళ్లు’ మధ్య అసమ్మతి సెగలు

పంచాయతీ నిధులు వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు మధ్య విద్వేషాలు రేగుతున్నాయి. తాజాగా వింజమూరు MPDO ఆఫీసులో జరిగిన సర్వ సభ్య సమావేశంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనుల వ్యవహారంలో మండల కన్వీనర్ గూడా నరసింహారెడ్డికి, ZPTC బాలకృష్ణారెడ్డికి మధ్య గొడవ రాజుకుంది. నిధుల వ్యవహారంలో పార్టీ నాయకుల మధ్య గొడవలు జరగడం పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది.
News December 27, 2025
నెల్లూరులో కలవనున్న గూడూరు?

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేశారు. సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. స్థానిక నేతల విజ్ఞప్తితో గూడూరును నెల్లూరులో కలిపే అంశంపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


