News September 16, 2024
నెల్లూరు :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
Similar News
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.
News December 5, 2025
నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.


