News August 30, 2024

నెల్లూరు: ఫోర్జరీ కేసులో టీపీఓ అరెస్ట్

image

నగరపాలక సంస్థ కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో మరో టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్ కుమార్‌ను నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గురువారం అరెస్ట్ చేశారు. కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో ఇద్దరు టీపీఓలు, మేయర్ భర్త జయవర్ధన్, ఆయన సహాయకుడు, ఇద్దరు సచివాలయ ఉద్యోగులు, ప్రైవేట్ ఇంజినీర్ పై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.

Similar News

News February 20, 2025

నేడు నెల్లూరులో భారీ ర్యాలీ

image

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తేదీన నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదని ఆరోపించారు.

News February 19, 2025

నెల్లూరు: న్యాయ సేవ సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్

image

జిల్లాలోని గూడూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, కోట, ఆత్మకూరు, వెంకటగిరి, S.పేట, N.పేట న్యాయ సేవ అధికార కమిటీల పారా లీగల్ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గీత ఒక ప్రకటన తెలిపారు. 25 లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా కోర్టుకు అందించాలన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ సేవకులు, లా విద్యార్థులు దరఖస్తు చేసుకోవచ్చన్నారు.

News February 19, 2025

నెల్లూరు: రూ.1,566 కోట్ల పెట్టుబడి.. 400మందికి ఉపాధి

image

రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 22726 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు పలు పరిశ్రమలు ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలకు SIPC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న SIPC భేటీలో ఆమోదించాల్సి ఉంది. కృష్ణపట్నంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ (రిలయన్స్) రూ.1,566 కోట్లతో మెగా ఇండస్ట్రియల్ పార్కు స్థాపించనుంది. దీంతో 400 మందికి ఉపాధి కలగనుంది.

error: Content is protected !!