News July 9, 2024

నెల్లూరు: బస్సు డ్రైవర్‌కి మూర్ఛ.. ఐదు కార్లను ఢీకొన్న స్కూల్ బస్సు

image

నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి నుంచి మినీ బైపాస్‌కు ఫ్లైఓవర్ మీదుగా ఓ పాఠశాల బస్సు వెళ్తోంది. ఫ్లైఓవర్ దిగగానే బస్సు డ్రైవరుకు మూర్ఛ వచ్చింది. ఈక్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఐదు కార్లను వెనువెంటనే ఢీకొంది. బస్సులో ఉన్న ఓ మహిళ కిందపడిపోయారు. స్థానికులు డ్రైవరును ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న కార్లలోనూ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Similar News

News January 7, 2026

నెల్లూరు: మత్స్యకారులకు నావిగేషన్ పరికరాలు

image

నెల్లూరు జిల్లాలో మత్స్యకారులకు భద్రతతో పాటు చేపలు ఉండే ప్రాంతాన్ని పసిగట్టే నావిగేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. జిల్లాలో 3వేల బోట్లకు వీటిని అమర్చనుంది. నెల్లూరులోని జిల్లా మత్స్య శాఖ ఆఫీసుకు ఈ పరికరాలు వచ్చాయి. వీటిని బోట్లకు అమర్చడంతో మత్స్సకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

News January 6, 2026

నెల్లూరు: MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

image

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.

News January 6, 2026

నెల్లూరు కలెక్టర్ ఐడియా సూపర్..!

image

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు. ఛాంపియన్ ఫార్మర్, కిసాన్ సెల్‌తో ఇతర కలెక్టర్లకు ఆదర్శంగా మారారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ‘వన్ మంత్.. వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అధికారులు ఓ గ్రామానికి నెలకు 4సార్లు వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు. బుచ్చి మండలం మినగల్లులో ఈ కార్యక్రమాన్ని తహశీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.