News February 20, 2025
నెల్లూరు: బాలికకు ప్రేమపేరుతో బెదిరింపు.. ఐదేళ్లు జైలు శిక్ష

దామరమడుగు పల్లిపాలెం గ్రామానికి చెందిన పొట్లూరి ప్రసాద్కు పోక్సో కేసులో ఐదేళ్లు జైలు శిక్ష రూ.37 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. మే 20, 2021న పల్లిపాలెంకు చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ ప్రేమించకపోతే.. తన పేరు రాసి చనిపోతానని బెదిరించాడు. ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జీ కృష్ణకాంత్ అభినందించారు.
Similar News
News February 22, 2025
నెల్లూరు జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

✒ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: నెల్లూరు కలెక్టర్
✒ త్వరలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరు: మంత్రి నాదెండ్ల
✒ కందుకూరు: RTCబస్లోనే అనంత లోకాలకు
✒ నెల్లూరులో 40 కిలోల వెండి స్వాధీనం
✒ బుచ్చి గోదాములో మంత్రుల తనిఖీలు
✒ నెల్లూరు: మహిళా అధికారుల ఫైట్ (వీడియో)
✒ నెల్లూరు జిల్లా ఎస్పీ హెచ్చరిక
✒ కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు
✒ నెల్లూరు: వెబ్ సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు
News February 22, 2025
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: కలెక్టర్

నెల్లూరులో రేపు(ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని కోరారు.
News February 22, 2025
పెంచలకోన నరసింహ స్వామికి విశేష పూజలు

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.