News February 19, 2025

నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

image

నెల్లూరు నగరంలోని కపాడిపాలెంకు చెందిన షేక్ కరీముల్లాకు పోక్సో కేసులో పదేళ్ల జైలు శిక్ష రూ.20వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. ఫిబ్రవరి 4, 2015 నగరంలోని సంతపేట చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుడ్ ట్రైల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జీ కృష్ణ కాంత్ అభినందించారు.

Similar News

News December 2, 2025

నేడు నెల్లూరు జిల్లా బంద్

image

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బంద్ జరగనుంది. పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించాలని, గంజాయి మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని, పెంచలయ్య హత్యకు కారకులైన వారిని శిక్షించాలని జరుగుతున్న బంద్‌కి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న నిందితురాలు కామాక్షికి చెందిన ఇళ్లను స్థానికులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

News December 2, 2025

నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

image

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.

News December 2, 2025

నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

image

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.