News July 6, 2024

నెల్లూరు: భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం

image

భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం చేసిన ఘటన టీపీ గూడూరులో జరిగింది. పోలీసుల వివరాలు.. టీపీ గూడూరుకు చెందిన మహిళకు ఇదివరకే వివాహమవ్వగా ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. భర్తతో విభేదాలు వచ్చి కనిగిరికి చెందిన కె.మల్లిఖార్జునను చేసుకుంది. వీరికి కూడా గొడవలు రావడంతో జూన్ 29న స్కూలుకు వెళ్లి.. దుస్తులు కొనిస్తానని భార్య కుమార్తెను బైకుపై బల్లిపల్లి అడవిలోకి తీసుకువెళ్లాడు. రెండురోజుల పాటు అత్యాచారం చేశాడు.

Similar News

News September 17, 2025

కావలిలో SI ఇంటి ముందు మహిళ ఆందోళన

image

కావలిలోని ముసునూరులో SI వెంకట్రావు ఇంటిముందు మంగళవారం రాత్రి ఓ మహిళ ఆందోళనకు దిగింది. గతంలో ఎస్ఐ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు ఎస్ఐ వెంకట్రావుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నగదు ఇచ్చేలా ఇటీవల ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. మధ్యవర్తులు తనకు నగదు ఇవ్వలేదని ఆమె నిన్న రాత్రి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆందోళన చేసింది.

News September 16, 2025

ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేనా…?

image

నెల్లూరు జిల్లాలో ఎడగారుగా 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కోతలు కోసే సమయానికి వర్షాలు పడడంతో పలుచోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 16, 2025

నెల్లూరు: జాడ తెలియని బై జ్యూస్ ట్యాబ్‌లు

image

2022-23, 2023-24లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు (20,830) ఉపాధ్యాయులకు (3,554) గత YCP ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చింది. బైజూస్‌తో ఒప్పందం కుదుర్చి కొంతమంది సబ్జెక్టులు అప్లోడ్ చేశారు. పాఠ్యాంశాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో డిజిటల్ బోధన ప్రభావం చూపలేదు. కొన్నాళ్లకే ట్యాబ్‌లు పనిచేయక విద్యార్థులు పక్కన పెట్టారు. కొందరు గేమ్స్, వినోదం కోసం వాడేశారు. ప్రస్తుతం ఆ ట్యాబ్‌లు ఎక్కడున్నాయో స్పష్టత లేదు.