News March 28, 2024
నెల్లూరు: మాజీ MLAని YCPలోకి ఆహ్వానించిన సీఎం జగన్

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ క్యాంప్ సైట్ లో ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరిగాయి. వైసీపీలో చేరాలని విష్ణును జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని విష్ణు స్పష్టం చేశారు. విష్ణు తీసుకునే నిర్ణయం కోసం ఆయన అనుచరగణం ఎదురుచూస్తోంది.
Similar News
News October 14, 2025
జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.
News October 14, 2025
తగ్గిన డిమాండ్.. పతనమవుతున్న ధరలు

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణం అంటున్నారు. సాధారణంగా దీపావళికి డిమాండ్ ఉంటుందని, ఈ దఫా అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం ధర కిలో రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుందన్నారు. రానున్న కాలంలో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.
News October 14, 2025
MROపై దౌర్జన్యం.. పోలీసులకు ఫిర్యాదు

లింగసముద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సోమవారం తాగిన స్థితిలో ఉన్న ఆయన డ్యూటీలో ఉన్న తహశీల్దార్పై ఆయన ఛాంబర్లోనే దౌర్జన్యానికి తెగబడి, నానా మాటలు అన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనపై దౌర్జన్యం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహశీల్దార్ కోటేశ్వరరావు తెలిపారు.


