News November 27, 2024
నెల్లూరు మెడికల్ కాలేజీకి కొత్తగా 9 పీజీ మెడికల్ సీట్లు

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 9 పీజీ సీట్లను కేంద్ర వైద్యారోగ్య శాఖ కేటాయించింది. 2024- 25 సంవత్సరానికి గాను ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో ఈ సీట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నెల్లూరు మెడికల్ కళాశాలకు సమాచారం అందించింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి వల్లే ఇది సాధ్యమైనందని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 20, 2025
కందుకూరు TDPలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

కందుకూరు నియోజకవర్గ టీడీపీలో ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ..’ అన్న సామెత ఆదివారం నిజమైంది. రెండు దశాబ్దాల పాటు TDPలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ MLA డా.దివి శివరాంకు ఆదివారం దారకానిపాడులో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. శివరాం అనుచరుడిగా, ఆయన పైరవీలతో పార్టీ ఇన్ఛార్జ్ అయి, ప్రస్తుతం MLAగా ఉన్న ఇంటూరి నాగేశ్వరావు కుర్చీలో కూర్చుంటే వెనుక వరుసలో శివరాం నిలబడాల్సి వచ్చింది.
News October 20, 2025
కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 20, 2025
కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.