News May 24, 2024
నెల్లూరు : మే25న ఏపీపీఎస్సీ పరీక్ష
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డీఆర్డీ లవన్న తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాలులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షపై సమన్వయ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో డీఆర్డీ సమావేశం నిర్వహించారు. పరీక్షను పక్కాగా నిర్వహించాలన్నారు.
Similar News
News September 29, 2024
నెల్లూరు జిల్లాలో ASIలుగా పోస్టింగ్ పొందింది వీరే..
➥భాస్కర్ రెడ్డి-ఏఎస్ పేట
➥రియాజ్ అహ్మద్-చిన్నబజార్
➥వరప్రసాద్, ఉమామహేశ్వరరావు-సౌత్ ట్రాఫిక్
➥శ్రీహరిబాబు, శ్రీధర్రావు, లక్ష్మీ నరసయ్య-నవాబుపేట
➥షేక్.జిలాని-మనుబోలు
➥మాల్యాద్రి-కావలి2
➥మునిరావు-వేదాయపాలెం
➥రాజగోపాల్-గుడ్లూరు
➥ వెంకటేశ్వర్లు-ఇందుకూరుపేట
➥మాధవరావు-వేదయపాలెం
➥కరీముల్లా-విడవలూరు
➥సురేంద్రబాబు-Nరూరల్
➥మునికృష్ణ-వెంకటాచలం
➥V.శ్రీనివాసులు-కోవూరు
News September 29, 2024
నెల్లూరు: వదినను చంపిన వ్యక్తి అరెస్ట్
గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నూరులో వదినను హత్య చేసిన కేసులో ముద్దాయి పాలెపు రమేశ్ను శనివారం అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై పి మనోజ్ కుమార్ తెలిపారు. తిప్పవరప్పాడు జంక్షన్ వద్ద గూడూరు రూరల్ CI , SI, సిబ్బందితో కలిసి అరెస్టు చేశామని అన్నారు.
News September 29, 2024
ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్
ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గోడౌన్ల లోని ఈవీఎంలు, వివి ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.