News August 18, 2024
నెల్లూరు: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ: గవర్నర్

మొక్కల పెంపకం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో శనివారం జరిగిన స్వర్ణ భారత్ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో మొక్క నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
నెల్లూరులో ట్రాఫిక్ ASI సస్పెండ్

నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ASI వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న <<19199048>>వీడియో <<>>వైరల్గా మారింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే.. ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేటు పడింది.
News February 22, 2026
నెల్లూరు: జైల్లో పొక్సో కేసు నిందితుడి మృతి.!

నెల్లూరు సెంట్రల్ జైల్లో పొక్సో కేస్ నిందితుడు మట్టి సుబ్బారావు (58) ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ భవానిపురానికి చెందిన సుబ్బారావు పది నెలలుగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. మృతదేహానికి ఆర్డీవో, MRO, వెంకటాచలం పోలీసులు సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
News February 22, 2026
నెల్లూరు: మల్టీప్లెక్స్ల్లో “తెరచాటు” దోపిడి!

నెల్లూరువాసులకు ఆదివారం వచ్చిందంటే సినిమాలు, బీచ్లు, పార్కులకు కుటుంబ సమేతంగా వెళ్తుంటారు. సినిమా ప్రేమికులు అయితే కుటుంబ సమేతంగా మల్టిప్లెక్స్లో సినిమాకి వెళ్లాలంటే రూ.2వేలు నుంచి రూ.4వేలు వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. టికెట్లు రూ.వెయ్యి లోపు అయినా, తినుబండారాలకు రూ.2వేలకు పైన ఖర్చు అవుతుందని అంటున్నారు. అధికారులు ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


