News May 12, 2024

నెల్లూరు: రండి.. అందరూ ఓటేయండి

image

నెల్లూరు జిల్లాలో ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు శ్రమిస్తున్నారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఓటింగ్‌కు రావాలని కోరుతున్నారు. కొన్ని సంస్థలు ఓటర్లకు ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా గూడూరులోని ఓ హాస్పిటల్ ఓటు వేసిన వారికి మూడు నెలలపాటు ఓపీ, ఏడాదిపాటు టెలీ కన్సల్టెన్సీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఎవరో ఆఫర్లు ఇచ్చారని కాదు.. అందరూ స్వచ్ఛందంగా ఓటేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

Similar News

News December 27, 2025

నెల్లూరులో ఫేక్ ITCలతో రూ. 43 కోట్ల టోకరా !

image

నెల్లూరులో పెద్ద పెద్ద కంపెనీలు పన్నుల ఎగవేతకు కొత్త పంథాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ జేసీ కిరణకుమార్ Way2Newsతో మాట్లాడుతూ.. నెల్లూరు డివిజన్ పరిధిలో రూ. 43 కోట్ల మేరా ఫేక్ ITC లను తీసుకున్నారని తెలిపారు. 8 సంస్థలపై కేసులు నమోదు చేశామని, ఇందులో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా.. ముగ్గురు 10% డిమాండ్ కట్టి అప్పీల్ కి వెళ్లారని వివరించారు.

News December 27, 2025

నెల్లూరు: ‘తెలుగు తమ్ముళ్లు’ మధ్య అసమ్మతి సెగలు

image

పంచాయతీ నిధులు వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు మధ్య విద్వేషాలు రేగుతున్నాయి. తాజాగా వింజమూరు MPDO ఆఫీసులో జరిగిన సర్వ సభ్య సమావేశంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనుల వ్యవహారంలో మండల కన్వీనర్ గూడా నరసింహారెడ్డికి, ZPTC బాలకృష్ణారెడ్డికి మధ్య గొడవ రాజుకుంది. నిధుల వ్యవహారంలో పార్టీ నాయకుల మధ్య గొడవలు జరగడం పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది.

News December 27, 2025

నెల్లూరులో కలవనున్న గూడూరు?

image

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేశారు. సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. స్థానిక నేతల విజ్ఞప్తితో గూడూరును నెల్లూరులో కలిపే అంశంపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.