News September 1, 2024
నెల్లూరు రూరల్లో వైసీపీ కార్పొరేటర్లు అంతా టీడీపీలోకి?

నెల్లూరు రూరల్లో వైసీపీ కార్పొరేటర్లు పేనాటి సుధాకర్, ఆశోక్ నాయుడు, తాళ్లూరి అవినాశ్, ఫామిదా ఇవాళ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం 26 మంది కార్పొరేటర్ లు ఉండగా ఇప్పటికే కోటంరెడ్డి సోదరుల వెంట 9 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో 13 మంది కార్పొరేటర్లు కోటంరెడ్డి సోదరులను కలిసి తమ పార్టీలో చేరేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
Similar News
News November 16, 2025
రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
News November 16, 2025
నెల్లూరు: బలవంతంగా పసుపుతాడు కట్టి బాలికపై ఆత్యాచారం

గుంటూరు రూరల్కు చెందిన బాలికపై అత్యాచారం కేసులో నెల్లూరుకు చెందిన నిందితుడు బన్నీ, సహకరించిన అతడి అమ్మ, అమ్మమ్మను గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ అరెస్ట్ చేశారు. గుంటూరు రూరల్లో పదో తరగతి చదివే బాలికను బన్నీ నెల్లూరుకు తీసుకెళ్లి బలవంతంగా పసుపుతాడు కట్టి, అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. పోక్సో చట్టం ప్రకారం సహకరించిన వారికి కూడా సమాన శిక్ష వర్తిస్తుందని పోలీసులు తెలిపారు.
News November 16, 2025
మర్రిపాడు: హైవేపై ఘోర ప్రమాదం.. 10మందికి గాయాలు

మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల్ నాటే కూలీలు వస్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


