News April 10, 2024
నెల్లూరు: రూ.2.70 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.2.70 లక్షల నగదును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పట్టుకున్నారు. వేదాయపాలెం, కొడవలూరు, కావలి ఒకటో పట్టణం, గ్రామీణం, జలదంకి, చేజర్ల, మర్రిపాడు, కలువాయి, సైదాపురం పరిధిలో 196 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ తెలియజేశారు
Similar News
News September 30, 2024
నెల్లూరులో రైలు ఢీకొని మహిళ మృతి
నెల్లూరు రైల్వే స్టేషన్లో ఆదివారం రాత్రి గూడ్స్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన రైల్వే పోలీసుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 30, 2024
నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్
సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 29, 2024
గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు
గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.