News September 15, 2024
నెల్లూరు: రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం మిలాద్ ఉన్ నబీ పండగ సెలవు కావడంతో నిర్వహించడం లేదని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రజలు, ఫిర్యాదు దారులు ఈ విషయాన్ని గమనించగలరని పోలీస్ శాఖ అధికారులు కోరారు.
Similar News
News January 11, 2026
రాష్ట్రంలో నెల్లూరుకు మొదటి స్థానం

జిల్లా మ్యూజియంకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కిన్నట్లు మ్యూజియం ఇన్ఛార్జ్ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 5 జిల్లా సైన్స్ మ్యూజియం కేంద్రాలు ఉండగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి డిసెంబర్ వరకు సైన్స్ మ్యూజియం చూసేందుకు వచ్చిన సందర్శకుల వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు – 10 వేలు, కడప – 854, ఏలూరు – 3,540, చిత్తూరు – 4,000, అనంతపురం – 5,636 మంది సందర్శించారు.
News January 11, 2026
నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

నెల్లూరు సెంటర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు 2022 సంవత్సరంలో తన భార్యను హత్య చేసి శిక్షను అనుభవిస్తున్నాడు. రెండు సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్షణ అనుభవించి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ సైదులు సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు తరలించారు. వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు.
News January 11, 2026
నెల్లూరు: త్వరలో మూడు చోట్ల ఇసుక రీచ్లు.?

పెన్నా పరీవాహక ప్రాంతంలో మరో 3 చోట్ల కొత్త ఇసుక రీచ్లు రానున్నాయట. ఇప్పటికే పొట్టేపాలెం, సంగం, సూరాయాపాలెం వద్ద పాయింట్లు ఉండగా విరువూరు వద్ద ఓపెన్ రీచ్ ఉంది. వీటితోపాటు మైన్స్ అధికారులు చేజర్ల మండల పరిధిలో మాముడూరు, కోటితీర్ధం, నెల్లూరు రూరల్లో ములుముడి ప్రాంతాల్లో కొత్తగా రీచ్లు ఓపెన్ చేసేందుకు కలెక్టర్కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. లేగుంటపాడులోనూ రీచ్ కోసం అధికారులు పరిశీంచారు.


