News April 8, 2024
నెల్లూరు: రైలు కింద పడి యువకుడి మృతి

రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన నెల్లూరు- వేదాయపాలెం రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం జరిగింది. రైల్వే ఎస్సై మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష

కోవూరు పరిధిలో నమోదైన పోక్సో కేస్లో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పునిచ్చారు. 2021 MAR. 21న మహిళా పోలీస్ స్టేషన్లో కోవూరు(M)నికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
News December 10, 2025
నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.
News December 10, 2025
నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.


