News March 20, 2024

నెల్లూరు: లక్షితను చంపిన చిరుత గుర్తింపు

image

గతేడాది ఆగస్టులో అలిపిరి వద్ద చిరుత దాడిలో నెల్లూరు జిల్లా కోవూరు(M) పోతిరెడ్డిపాలేనికి చెందిన లక్షిత చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్‌కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్‌రెడ్డి చెప్పారు.

Similar News

News November 24, 2025

VPR దంపతులను కలిసిన జడ్పీ సీఈవో

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన్ను జిల్లా పరిషత్‌కు కొత్త సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో నగరంలోని వీపీఆర్‌ నివాసానికి వచ్చిన ఆయన వేమిరెడ్డి దంపతులను కలిసి బొకే అందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వేమిరెడ్డి సూచించారు.

News November 24, 2025

కాసేపట్లో నెల్లూరుకు మంత్రి సత్యకుమార్ రాక

image

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం విలుకానిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.. సాయంత్రం వరకు అక్కడే కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.

News November 24, 2025

కాసేపట్లో నెల్లూరుకు మంత్రి సత్యకుమార్ రాక

image

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం విలుకానిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.. సాయంత్రం వరకు అక్కడే కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.