News June 25, 2024
నెల్లూరు: వచ్చే నెలలో రొట్టెల పండుగ

రాష్ట్ర పండుగగా జరుపుకునే నెల్లూరులోని బారాషహీద్ రొట్టెల పండుగకు ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 17వ తేదీ నుంచి ఐదు రోజులపాటు స్వర్ణాల చెరువు చెంతన జరిగే ఈ వేడుకకు ముస్లింలతో పాటు హిందువులు భారీగా తరలివస్తారు. ఇందుకోసం నగర పాలక సంస్థ వివిధ ప్రజా అవసరాల పనులకు రూ.3.1 కోట్లు కేటాయించింది. ప్రైవేట్ కూలీలు, చెత్త తరలింపునకు ప్రైవేట్ వాహనాలు అంశాలతో కూడిన 11 పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.
Similar News
News February 13, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో చెక్పోస్టుల ఏర్పాటు

నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకకుండా చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు. మనుబోలు పశు వైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ఆరు చోట్ల చెక్పోస్ట్ల నుంచి ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను అడ్డుకుంటామన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లను నిర్భయంగా తినవచ్చు అన్నారు.
News February 13, 2025
నెల్లూరు జిల్లాలో మరో రేప్ అటెంప్ట్!

వెంకటాచలం మండలంలోని విద్యార్థినిపై రేప్ అటెంప్ట్ జరిగిన విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్లో చదివే విద్యార్థులే ఆ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
42 మంది నెల్లూరు కార్పొరేటర్లకు నోటీసులు

ఇటీవల నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో 42 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. అయితే 42 మంది కార్పొరేటర్లు విప్ ధిక్కరించారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వారికి నోటీసులు జారీ చేశారు. జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన కరిముల్లాకు కాకుండా కూటమి బలపరిచిన అభ్యర్థికి 40 ఓట్లు వేయగా, ఇద్దరు ఓటింగుకు పాల్గొనలేదు.