News February 14, 2025
నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూ రులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు ముందు టీచర్ మందలించడంతో మనస్తాపం చెంది భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆనంతరం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 10, 2026
12న నెల్లూరు జిల్లాకు మాజీ ఉపరాష్ట్రపతి రాక

నెల్లూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పర్యటన ఖరారైంది. ఈనెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 12న స్వర్ణ భారత్ ట్రస్ట్కు వస్తారు. 17వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి హైదరాబాద్కు తిరిగి వెళ్తారు.
News January 10, 2026
నెల్లూరు ఎస్పీని అభినందించిన హోం మంత్రి

నెల్లూరు ఎస్పీ అజితా వేజండ్లను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. నెల్లూరు జిల్లా జైలును ఆమె తనిఖీ చేశారు. జిల్లాలో మంచి సంస్కృతి నెలకొందని చెప్పారు. రౌడీ షీటర్లు, పీడీ యాక్ట్, రప్పా రప్పా అంటూ కత్తులతో తిరిగే బ్యాచ్ను రోడ్లమీద నడిపించడాన్ని మంత్రి అభినందించారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News January 9, 2026
నెల్లూరు జిల్లాలో రూ.6675 కోట్లతో పవర్ ప్లాంట్

నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు IFFCO kisan SEZలో టాటా సంస్థ 6,675 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమను కేటాయించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా పురోగతి లేని ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమల రాకతో యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


