News February 15, 2025
నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఉపాధ్యాయుడిపై కేసు

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు ముందు టీచర్ హేళనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేసి ఉపాధ్యాయుడు వీర రాఘవులుపై కేసు నమోదు చేశారు.
Similar News
News March 25, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ధరలు..?

నెల్లూరులో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నిరుడు పుట్టి(20 బస్తాలు) రూ.23వేల ధర పలగ్గా.. ఇప్పుడు ఆ ధర రూ.18,500కు తగ్గినట్లు రైతులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఈ ధర రూ.16వేల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతులకు రూ.19వేల మద్దతు ధర చెల్లిస్తుంది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో గ్రామం, మండలంతో కామెంట్ చేయండి.
News March 25, 2025
నెల్లూరులో జాడే లేని అనిల్ కుమార్ యాదవ్.?

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి దూకుడు పెంచారు. వరుసగా కార్యకర్తలు, నేతలను కలుస్తూ వారికి అండగా ఉంటున్నారు. MLC చంద్రశేఖర్ రెడ్డి సైతం అటు శాసనమండలి, ఇటు బహిరంగంగా టీడీపీ నేతలను ఎండగడుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వంటి నేతలు మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News March 25, 2025
అక్రమ కేసులకు భయపడం: కాకాణి

టీడీపీ నేతల దురాగతాలకు తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్న ఆయన.. YCP కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్పై ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు తాము భయపడమని, తాము తిరగబడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.