News February 15, 2025

నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఉపాధ్యాయుడిపై కేసు 

image

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు ముందు టీచర్ హేళనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేసి ఉపాధ్యాయుడు వీర రాఘవులుపై కేసు నమోదు చేశారు.

Similar News

News July 8, 2025

ఆ దాడికి మాకు సంబంధం లేదు: ప్రశాంతిరెడ్డి

image

మహిళ అని చూడకుండా నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్నను ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు సమర్ధించడం సరికాదని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ‘ప్రసన్నపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా. ఆయన నివాసంపై జరిగిన దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన నీచుడు ప్రసన్న’ అని ఆమె మండిపడ్డారు

News July 7, 2025

అనామకులతో అప్రమత్తంగా ఉండాలి: SP

image

మీ రక్షణే మా భద్రతగా నెల్లూరు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగలో పోలీసు బందోబస్తు, గంధ మహోత్సవానికి చేసిన ఏర్పాట్లను ఆయన పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాత్రికి జరగనున్న ప్రధాన ఘట్టం అయిన గంధ మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనామకులతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News July 7, 2025

నెల్లూరు: ఆరోగ్యం రొట్టె పట్టుకున్న మంత్రి నారా లోకేశ్

image

నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది. రెండో రోజు సోమవారం లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వీఐపీల తాకిడి కూడా ఎక్కువైంది. మంత్రి నారా లోకేశ్ రొట్టెల పండుగలో పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్యం రొట్టెను పట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మంత్రులు నారాయణ, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రార్థనలు పాల్గొన్నారు.