News January 14, 2025
నెల్లూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాచలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇందుకూరుపేట(M), లేబూరుకు చెందిన కాలేషా(45), అతని కొడుకు హమీద్(12) మృతి చెందారు. మనుబోలులో జరిగిన రోడ్డుప్రమాదంలో సైదాపురం(M), గంగదేవిపల్లికి చెందిన సుబ్బయ్య(34), శంకరయ్య(39)దుర్మరణం చెందారు. గుడ్లూరులో జరిగి రోడ్డుప్రమాదంలో రాపూరుకు చెందిన వెంకటేశ్వర్లు(60), హార్దిక రాజ్(4) మరణించారు.
Similar News
News November 18, 2025
నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.14.90 లక్షలు స్వాహా

నెల్లూరులోని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.14.90 లక్షలు తీసుకున్నారని SP డా.అజిత వేజెండ్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. బీవీ నగర్కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పించకుండా.. నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
News November 18, 2025
నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.14.90 లక్షలు స్వాహా

నెల్లూరులోని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.14.90 లక్షలు తీసుకున్నారని SP డా.అజిత వేజెండ్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. బీవీ నగర్కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పించకుండా.. నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
News November 18, 2025
ముత్తుకూరు హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం రొయ్యలపాలెంలో జరిగిన హత్య కేసులో ముద్దాయి పాముల శీనయ్యకు జీవిత ఖైదుతోపాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు 3rd ADJ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2022 సం. ఏప్రిల్ 24న ముద్దాయి తన అన్నతో ఆస్తి విషయంలో గోడవ పడి అతని తలమీద కొట్టి ఇంటిని కాల్చి అతి కిరాతకంగా హత్య చేశాడు. తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచడంతో నేరం రుజువై శిక్ష ఖరారు చేశారు.


