News May 24, 2024

నెల్లూరు: హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

image

బాపట్లలో ఈ నెల 15న జరిగిన ప్రశాంత్ హత్యకేసులో నెల్లూరుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన ప్రశాంత్ బాపట్ల పాత బస్టాండ్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డితో పాటు ఆర్.లక్ష్మయ్య, ద్వారకా, చెర్ల లక్ష్మణ్, పంగా రోహిత్, కొమరిక ఈశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News November 26, 2025

నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

image

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్‌ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 26, 2025

నెల్లూరు జిల్లా ఇలా..

image

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు: నెల్లూరు సిటీ, రూరల్, కావలి, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి
మండలాలు(30):A.సాగరం, AS పేట, ఆత్మకూరు, మర్రిపాడు, సంగం, చేజర్ల, జలదంకి, SRపురం, ఉదయగిరి, V.పాడు, వింజమూరు, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం, బుచ్చి, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, అల్లూరు, కావలి, దగదర్తి, బోగోలు, పొదలకూరు, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, TP గూడూరు, నెల్లూరు సిటీ, రూరల్

News November 26, 2025

నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

image

నెల్లూరు రూరల్‌లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్‌తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.