News March 17, 2025

నెల్లూరు : 174 కేంద్రాలు…33,434 మంది విద్యార్ధులు

image

నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO బాలాజీ రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 174 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 33,434 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ‌విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందు రావాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్ష బాగా రాయాలన్నారు.

Similar News

News March 1, 2026

ఆన్లైన్లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా: నెల్లూరు డీఈవో

image

జిల్లాలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను http://deonellore.50webs.com/ ఆన్లైన్లో పొందుపరిచామని డీఈవో డా. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాల సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో రేపటి నుంచి 7వ తేదీ లోగా పని దినాలలో సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్‌లో అందజేయాలన్నారు.

News March 1, 2026

ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

News March 1, 2026

నెల్లూరు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఎస్పీ ఏమన్నారంటే.!

image

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ అజిత వాజెండ్ల తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారని చెప్పారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.