News May 20, 2024
నెల్లూరు: 21నే జిల్లాకు రానున్న గవర్నర్

గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పాత షెడ్యూల్ ప్రకారం ఆయన 22న జిల్లాకు రానుండగా.. తాజా షెడ్యూల్ ప్రకాం 21వ తేదీ సాయంత్రం 5.10 నిమిషాలకు గుంటూరు నుంచి రైలులో బయలుదేరి రాత్రి 9.24 నిమిషాలకు నెల్లూరుకు చేరుకోనున్నారు. 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు.
Similar News
News November 17, 2025
అల్లూరు: బొలేరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి

అల్లూరు(M) సింగపేట వద్ద భవన నిర్మాణ కార్మికులు వెళుతున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై శ్రీనివాసరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు కావలి(M) బట్లదిన్నెకు చెందిన శీనయ్య, ప్రసాద్గా గుర్తించారు.
News November 17, 2025
నెల్లూరు: కరెంట్ సమస్యలు ఉన్నాయా?

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్&ఎండీ శివశంకర్ తెలిపారు. నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 89777 16661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News November 16, 2025
రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.


