News April 17, 2025
నెల్లూరు: 3.69 లక్షల ఎకరాలకు సాగునీరు

నెల్లూరు జిల్లాలో 3.69 లక్షల ఎకరాల రెండో పంటకు నీరు అందించాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నెల్లూరులోని జడ్పీ హాలులో ఐఏబీ సమావేశం జరిగింది. 41 టీఎంసీల జలాలను రెండో పంటకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఈ విషయంలో సాగునీటి సంఘాల ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
Similar News
News April 20, 2025
రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్: మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా డిస్పెన్సింగ్ యూనిట్ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.
News April 20, 2025
నెల్లూరులో 647 టీచర్ పోస్టులు

డీఎస్సీ-2025 ద్వారా నెల్లూరు జిల్లాలో 647 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:39
➤ హిందీ:18 ➤ ఇంగ్లిష్: 84
➤ గణితం: 63 ➤ఫిజిక్స్: 76
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 103
➤ పీఈటీ: 107 ➤ఎస్జీటీ: 115 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్ఏ హిందీ 1, ఇంగ్లిష్ 1, మ్యాథ్స్ 1, ఎస్టీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.
News April 20, 2025
రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్: మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా డిస్పెన్సింగ్ యూనిట్ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.