News June 13, 2024
నెల్లూరు: 35 ఏళ్ల తర్వాత రెండోసారి

ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆనం మొదటిసారి 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో కేవీఎస్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1985లో రాపూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొంది 1989లో దివంగత ఎన్టీఆర్ మంత్రివర్గంలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 35 ఏళ్ల తర్వాత రెండోసారి టీడీపీలో మంత్రిగా ఆనం ఎంపిక కావడం విశేషం.
Similar News
News March 15, 2025
నెల్లూరు: 174 పరీక్షా కేంద్రాలు.. 33,434 మంది విద్యార్థులు

సంగం జడ్పీ హైస్కూల్ను శనివారం డీఈవో సందర్శించారు. పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీ రావు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 174 పరీక్షా కేంద్రాలలో 33,434 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.
News March 15, 2025
రౌడీ షీటర్ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ నెల్లూరు

నెల్లూరు నగరం పాత వేదయపాలెంకు చెందిన రౌడీ షీటర్ సృజన్ కృష్ణ (చింటూ)ను అత్యంత కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో హత్య చేశారు. ఈ హత్య వెనుక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ తరలించారు. హత్యకు గల కారణాలపై వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సాంకేతిక పరిశోధనతో పాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
News March 14, 2025
నెల్లూరులో దారుణ హత్య

నెల్లూరు దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. గతంలో రామలింగపురం అండర్ బ్రిడ్జి దగ్గర జరిగిన కత్తి రవి హత్య కేసులో ఉన్న చింటూగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.