News April 6, 2024

నెల్లూరు: CM జగన్‌ని కలిసిన జబర్దస్త్ ఫేమ్ రియాజ్

image

నెల్లూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం జబర్దస్త్ ఫేమ్ రియాజ్ కలిశారు. పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ జగన్‌ను కలిశారు. కాగా రియాజ్ వైసీపీ దివ్యాంగుల నగర కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాజ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Similar News

News December 5, 2025

అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.

News December 5, 2025

నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

image

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.